28 ఏళ్ల తర్వాత కలిశారు..హన్మకొండ జిల్లా మల్లికుదుర్ల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

28 ఏళ్ల తర్వాత కలిశారు..హన్మకొండ జిల్లా మల్లికుదుర్ల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి 1997-–98 బ్యాచ్ విద్యార్థులు 28 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో వారికి విద్యనేర్పిన గురువులను సత్కరించారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుని సంతోషంగా గడిపారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ప్రభాకర్, ఉపాధ్యాయులు సత్యపాల్ రెడ్డి, షూకూర్, చంద్రయ్య, కిష్టయ్య, శాంతయ్య, సత్యప్రకాశ్, యాదవ రెడ్డి, అన్నపూర్ణ, శైలజ, పలువురు పూర్వ విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు.  - ధర్మసాగర్, వెలుగు​